వార్డుకు ఇద్దరు డాక్టర్లకు డ్యూటీ వేయాలి
కలెక్టర్ కే శశాంక
నోడల్ అధికారులతో సమావేశం
విద్యానగర్, మే 8 : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో కొవిడ్ పేషెంట్లకు మెరుగైన వైద్య సే వలందించాలని కలెక్టర్ శశాంక వైద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లను ఆదేశింంచారు. కొవిడ్ వార్డు లో ఇద్దరు డాక్టర్లకు రోజూ డ్యూటీలు వేయాలని వైద్యశాల సూపరింటెండెంట్ను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ దవాఖనలో కొవిడ్ వైద్య సేవలపై వైద్య అధికారు లు, నోడల్ అధికారులతో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ వైద్య సేవల పర్యవేక్షణకు ఇద్దరు నోడల్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. వార్డులో ఉదయం, సాయంత్రం షిఫ్టుల్లో ఇద్దరు చొప్పున డాక్టర్లకు డ్యూటీలు వేయాలన్నారు. రాత్రి షిఫ్టుల్లో ఒకే డాక్టర్కు డ్యూటీ చేస్తే సరిపోతుందని తెలిపారు. అన్ని వార్డులో డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. దవాఖానకు అదనంగా 50 పడకలు కొనుగోలు చేశామని, వెంటనే వాటిని వార్డుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. మందులకు, ఆక్సిజన్కు, డాక్టర్లకు ,సిబ్బందికి కొరత లేదని పేర్కొన్నారు. నిత్యం డాక్టర్లు పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని వారిలో మనోధైర్యం నింపాలని సూచించారు. సరిపడా మందులను నిలువ ఉంచుకోవాలన్నారు. పారి శుధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. దవాఖాన డాక్టర్లు, స్టాప్ నర్సులు, వైద్య సిబ్బంది షిఫ్ట్ల వారీగా డ్యూటీలు కేటాయించాలని ఆదేశించారు. విధులకు హాజరుకాని డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్దేశించారు. కరోనా వార్డులో పల్స్ఆక్సీ మీటర్లు, థర్మామీటర్లు, మొ బైల్ ఎక్స్రే మిషన్, ఈసీజీ మిషన్, ఉండేలా చర్య లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కరోనా పేషెంట్లకు లిక్విడ్ డైట్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆక్సిజన్ వినియోగం పెరిగినం దునా వృథా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లీకేజీ ఉంటే వెంటనే అరికట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య, డాక్టర్ పద్మ , డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అలీమ్, నోడల్ ఆఫీసర్లు మనోజ్ కుమార్, మధుసూదన్ పాల్గొన్నారు.
సర్వే తీరును పర్యవేక్షించాలి..
జిల్లాలో జరుగుతున్న ఇంటింటికీ ఆరోగ్య సర్వేతీరును ప్రోగ్రాం ఆఫీసర్లు రోజూ పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లతో ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు, వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జి ల్లాలో ప్రోగ్రాం ఆఫీసర్ల పరిధిలోని మండలాల్లో ఎన్ని టీంలు ఏర్పాటు చేశారు, ఎంతమందికి ఆ రోగ్య పరీక్షలు నిర్వహించారు, ఎంతమందికి హోం ఐసోలేషన్ కిట్లు పంపిణీ చేశారనే వివరా లను సేకరించాలని కోరారు. ఆరోగ్య పరీక్షల సం దర్భంగా కరోనా లక్షణాలున్న వారికి హోం ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఇచ్చి మందులు ఎలా వా డాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అ వగాహన కల్పించాలన్నారు. ఐసోలేషన్ మెడికల్ కిట్లు ఇచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని తిరిగి వచ్చే సోమవారం ఆరోగ్య కార్యకర్తలు వారి ఇండ్లకు వెళ్లి తెలుసుకోవాలని, వ్యాధి తగ్గకుంటే స్టెరాయి డ్ మందులు ఇవ్వాలని సూచించారు. లేకుంటే కరోనా పరీక్షలు నిర్వహించి దగ్గరలోని ప్రభుత్వ దవాఖానకు పంపించాలని సూచించారు. నగరపాలక సంస్థ పరిధిలో 60 ఇంటింటికీ ఆరోగ్య పరీక్షల టీంలను ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేయాలన్నారు.
ప్రోగ్రాం ఆఫీసర్లు తమ పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి, ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు, మెడికల్ కిట్ల పంపిణీ, మందులు వాడే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో కరోనా ఓపీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఫస్ట్ డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారందరికీ సరిపోవు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఉందని కలెక్టర్ తెలిపారు. మొదటి డోస్ తీసుకున్నవారు ఆందోళన చెందవద్దన్నారు. ఆరోగ్య పరీక్షల టీం సభ్యులకు మా సులు, శానిటైజర్లు అందజేయాలని సూచించా రు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ సుధాకర్రెడ్డి, డాక్టర్ జువేరియా, ప్రోగ్రాం ఆఫీసర్లు, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ ర వీందర్రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ శిరీష, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.