హైదరారాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్రెడ్డి తెలిపారు. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్)లో అదనంగా 200 పడకలను ఏర్పాటు చేశామని చెప్పారు.
కొన్నిరాష్ట్రాలు తెలంగాణకు ఇవ్వాల్సిన ఆక్సిజన్ ఇవ్వకపోవడంతో కొరత తలెత్తే ప్రమాదముందని అన్నారు. కేంద్రం.. రాష్ట్రానికి 51 ఆక్సిజన్ జనరేటర్లు కేటాయించినట్లు వెల్లడించారు. కేటాయించిన వాటిలో ఎక్కువగా జిల్లాల్లోనే వినియోగించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత లేదని డీఎంఈ స్పష్టం చేశారు. కొవిడ్రోగులకు వైద్యులు అనవసరంగా టోసిలిజుమాబ్ ఇంజక్షన్ ఇవ్వవద్దని సూచించారు.
దీంతో వ్యాధులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. రెండో డోసు వారికి కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సినేషన్కు కృషి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో రోజువారీ ఆక్సిజన్ వినియోగం వివరాలను ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఎక్కువగా కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.