సాగర్కు వరద ఉధృతి

- ఇన్ఫ్లో 4,83,846, అవుట్ఫ్లో 5,00,446 క్యూసెక్కులు
- 18క్రస్టుగేట్ల ద్వారా నీటి విడుదల
నందికొండ : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్లోకి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో డ్యాం 18క్రస్టుగేట్లను 15అడుగుల మేర ఎత్తి 3,88,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు 4,83,846 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో ఆధారంగా డ్యాం క్రస్టుగేట్లను పెంచుతూ, తగ్గిస్తూ ఉన్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590(312.50టీఎంసీలు)అడుగులకు గురువారం 589.10 అడుగుల వద్ద 309.3558 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్ల ద్వారా 4,93,278 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 7828, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 29,070 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి 5,00,446 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా ఎడమ కాల్వ, ఎస్ఎల్బీసీ, వరద కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు.
పులిచింతలకు 4.73లక్షల ఇన్ఫ్లో
చింతలపాలెం : పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175.00(45.77టీఎంసీలు) అడుగులకు గురువారం సాయంత్రం 172.898(42.5720 టీఎంసీలు)అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 4,73,518 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 18గేట్ల ద్వారా 5,33,690 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
- ఇండియన్స్ను తక్కువ అంచనా వేయం: ఆస్ట్రేలియా కోచ్
- 'కృష్ణా బోర్డు విశాఖలో వద్దు'
- టెస్లా ఎంట్రీతో నో ప్రాబ్లం: బెంజ్
- చైనాకు కాంగ్రెస్ లొంగుతుందా? : జేపీ నడ్డా
- టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్ ఇతడే..!
- ఎంపీలకు జలక్.. పార్లమెంట్లో ఆహార సబ్సిడీ ఎత్తివేత
- ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
- 4,54,049 మందికి కోవిడ్ టీకా ఇచ్చేశాం..
- 10 కోట్ల డౌన్లోడ్లు సాధించిన మోజ్
- ఆటా ప్రెసిడెంట్గా భువనేశ్ బుజాల బాధ్యతల స్వీకరణ