మెదక్, మే 2 : బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రజలు అండగా నిలిచారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మాట్లాడారు. కోట్ల డబ్బును, ఓట్ల కోసం ఆ పార్టీలో చీలికలు తెచ్చినా, జనం మాత్రం మమతా బెనర్జీ వెంటనే ఉన్నారని అన్నారు. ప్రచారం చేయకుండా దాడులు చేయించినా, వీల్ చైర్పైనే ఆమె ప్రచారం చేసిందని గుర్తుచేశారు. జనం మెచ్చిన నాయకురాలిగా విజయదుందుబి మోగించిందన్నారు. ఎన్నో కుతంత్రాలను ఎదుర్కొని నిలిచి గెలిచిన మమతా బెనర్జీకి ఈ సందర్భంగా ఆయన శుభాక్షాంక్షలు తెలిపారు.