ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇటీవల వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమా తర్వాత నుండి పూజా హెగ్డే బుట్టబొమ్మగా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలలో బిజీ హీరోయిన్గా మారింది. అయితే విజయ్ సరసన దళపతి 65లో నటిస్తున్న పూజా హెగ్డేకి కరోనా పాజిటివ్ సోకింది.ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
కొద్ది రోజులుగా క్వారంటైన్లో ఉంటున్న పూజా హెగ్డే తన హెల్త్కు సంబంధించిన విషయాలను రెగ్యులర్గా పంచుకుంటుంది. తాజాగా వీడియో ద్వారా.. నాకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఎవరు భయపడొద్దు.వీలైనంత త్వరగా ఆనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిద్దాం. మీరు నవ్విస్తారు, ప్రేమిస్తారు అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. పూజా నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.