హైదరాబాద్ : పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని చందానగర్లో ఆదివారం చోటుచేసుకుంది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సమాచారం మేరకు చందానగర్లోని శ్రీనివాస్ లాడ్జీపై రైడ్ చేసింది. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుంది. సంఘటనా స్థలం నుంచి రూ.75,690 నగదు, పేకాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను చందానగర్ పోలీసులకు అప్పగించారు.