ఎంత పెద్ద దర్శకుడు అయిన కెరీర్లో ఒక్కోసారి భయపడతాడు. తన సినిమాను చూసుకుని టెన్షన్ పడతాడు. దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. 20 ఏళ్ల కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు రాజమౌళి. ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు జక్కన్న. బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడు. అలాంటి దిగ్గజ దర్శకుడికి ఇప్పుడు ఒక సినిమా చుక్కలు చూపిస్తోంది. మూడేళ్లుగా ఒకే సినిమాను చెక్కుతూనే ఉన్నాడు రాజమౌళి.. అదే RRR. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలను ఒకే సినిమాలో కలిసి చూపిస్తున్నాడు రాజమౌళి. అలాంటి సాహసం చేస్తున్నప్పుడు సమయం కూడా ఎక్కువగానే పడుతుంది. అయితే అనుకున్న దాని కంటే రెండింతలు ఎక్కువ సమయం పడుతుండటంతో రాజమౌళి కంగారు పడుతున్నాడు.
2019లో ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు 2020 జూలై 30న విడుదల చేస్తానని మాటిచ్చాడు రాజమౌళి. అయితే అనుకోని కారణాలతో షూటింగ్ ఆలస్యం అయింది. దాంతో 2021 జనవరి 8కి వాయిదా వేశాడు. కానీ కరోనా వచ్చింది. దాంతో షూటింగ్ చాలా వరకు ఆగిపోయింది. దాంతో రిలీజ్ డేట్ అక్టోబర్ 13కు మార్చాడు రాజమౌళి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ సజావుగా సాగడం లేదు. ముంబైలో కేసులు దారుణంగా పెరిగిపోతుండటం వల్ల షూటింగులకు ఇబ్బందిగా మారింది. పరిస్థితులు చక్కబడ్డాక తర్వాత అక్కడ షూటింగ్ చేసుకోవాలి. అప్పటి వరకూ ఎదురుచూడక తప్పదు.
ఇవన్నీ చూస్తుంటే అక్టోబర్ 13 సినిమా వస్తుందా అంటే అనుమానమే. బాహుబలి లాంటి భారీ సినిమాను తెరకెక్కించినప్పుడు కూడా రాజమౌళి ఇంత కంగారు పడి ఉండకపోవచ్చు. కానీ త్రిపుల్ ఆర్ మాత్రం చాలా కంగారు పెడుతుంది. ఎందుకంటే రోజులు పెరిగిపోతున్న కొద్దీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటిపోయిందని తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే బిజినెస్ కూడా జరగాలి.. జరిగిన బిజినెస్ కు తగ్గట్టుగా కలెక్షన్స్ కూడా రావాలి. ఇవన్నీ జరగాలంటే సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలి. అలా జరుగుతుందో లేదో అని ఇప్పుడు రాజమౌళి కంగారు పడుతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కంగనా ‘ అష్టమి ప్రసాదం’ పై నెటిజన్ల ట్రోల్స్..!
జబర్దస్త్ లో కరోనా కలకలం..ఇంకా ఎంత మందికి వచ్చింది..?
వకీల్ సాబ్ పై మాజీ న్యాయమూర్తి ప్రశంసల జల్లు
అనిల్రావిపూడి కల నెలవేరబోతుందా..?