హైదరాబాద్ : నాలుగు తెలుగుమాటలు చెప్పుకునేందుకు వీధి అరుగు వేదికగా ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది తెలుగు భాషాభిమానులు వీధి అరుగు పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాల వేదికపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ నెల 25న అన్నమయ్య సంకీర్తనలతోపాటు సామాజిక ధృక్పథంపై నిర్వాహకులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సంగీత విద్వాంసురాలు, సంఘసేవకులు కొండవీటి జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
గాయని శివాని సరస్వతుల తన గానామృతంతో అలరించనున్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనల రాయబారి, మానవసేవే మాధవసేవ అని నమ్మి సమాజసేవ చేస్తున్న సంఘ సేవకురాలు, సంగీత ప్రపంచములో తనకంటూ ఒక విలక్షణ స్థానాన్ని, గుర్తింఫును తెచ్చుకున్న ఆధ్యాత్మికతత్వవిధురాలు, దీపశిఖాసమానులు, ‘అమ్మ జ్యోతిర్మయి/గురు జ్యోతిర్మయి’ గా ప్రసిద్ధిగాంచిన కొండవీటి జ్యోతిర్మయి ఈ నెల వీధి అరుగు విశిష్ట అతిథి.
అన్నమాచార్య సంకీర్తనల ద్వారా సమాజంలో మార్పు, చైతన్యం ఎలా తీసుకురావచ్చు? ఆధ్యాత్మిక భావనల ద్వారా ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించవచ్చు? సమకాలీన సామాజికాంశాలపై పోరాటంచేయటానికి గురు జ్యోతిర్మయి ఎంచుకున్న సాధనాలేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి వీధి అరుగు మీ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. మరిన్ని వివరాలకు ఫ్లయర్ చూడొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి