ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
అమీన్పూర్, ఏప్రిల్ 18: ప్రస్తుత సమయంలో ప్రతిఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పటాన్చెరు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్లోని బీరంగూడలో ఎస్ఎస్ భవానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ షాప్ను వారు ప్రారంభించారు. ఇందులో జొన్న రొట్టెలు, డ్రై ఫ్రూట్స్, పప్పుదినుసులు, కొర్రలు, బ్రౌన్ రైస్ వంటి ఆరోగ్యకరమైన ఫుడ్స్ దొరుకుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్, కౌన్సిలర్లు కృష్ణ, నాయకులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
PL 2021: రాణించిన రాహుల్, మయాంక్
నకిరేకల్ మున్సిపాలిటీకి 305 నామినేషన్లు