గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..