నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 14 : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టుల ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతున్నది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్నవారికి వైద్య సిబ్బంది బుధవారం టెస్టులు నిర్వహించారు. ఒక వైపు టెస్టులు నిర్వహిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించారు.
ధర్పల్లి మండలానికి చెందిన 18 మంది వైరస్బారిన పడ్డారని ఇన్చార్జి ప్రధానవైద్యుడు రఘువీర్ తెలిపారు. ఇందల్వాయి పీహెచ్సీలో 49 మందికి టెస్టులు నిర్వహించగా, 14 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ శుభాకర్ తెలిపారు. కోటగిరి మండలానికి చెందిన 42 మందికి కరోనా వచ్చిందని హెల్త్ సూపర్వైజర్ కృష్ణవేణి, కోటగిరి దవాఖాన వైద్యురాలు సమత తెలిపారు. కంటైన్మెంట్ జోన్గా గుర్తించిన సుంకినిలో సర్పంచ్ మాధవరావు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. వల్లభాపూర్, సోంపూర్ గ్రా మాలకు చెందిన 45 ఏండ్లుపైబడిన వారిని సర్పంచులు ట్రాక్టర్లలో కోటగిరి, పొతంగల్ దవాఖానలకు తరలించి టీకాలు వేయించారు.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పొతంగల్, హంగర్గాఫారం గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేయాలని పాలకవర్గాలు తీర్మానించాయి.
వర్నిలోని కమ్యూనిటీ వైద్యశాలలో 100 మందికి టెస్టులు నిర్వహించగా, 33 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. వర్ని మండల కేంద్రానికి చెందిన మహిళ కరోనాబారినపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సిరికొండలో 50 మందికి టెస్టులు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి మోహన్ తెలిపారు. రెంజల్ పీహెచ్సీలో బుధవారం 141 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, 25 మందికి పా జిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారిణి క్రిస్టినా తెలిపారు. భీమ్గల్లోని ప్రభుత్వ దవాఖానలో 117మందికి టెస్టులు చేయగా, 42 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని డాక్టర్ అజయ్పవార్ తెలిపారు. పీహెచ్సీలో ఎంపీపీ ఆర్మూర్ మహేశ్తోపాటు మొత్తం 141 మందికి టీకా వేసినట్లు చెప్పారు. బోధన్ మండలంలోని సాలూరా పీహెచ్సీ, చెక్పోస్ట్ వద్ద 92 మందికి పరీక్షలు నిర్వహించగా, 45 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రేఖ తెలిపారు. మా క్లూర్ మండలం మాక్లూర్, కల్లడి పీహెచ్సీ పరిధిలో మొత్తం 173 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 41 మందికి పాజిటివ్గా తేలినట్లు వై ద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు.