ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
ధర్మారం, కోరుట్ల జాతీయ స్థాయికి ఎంపిక కావడం అభినందనీయం
ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి
మంత్రి కొప్పుల ఈశ్వర్
ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్మానం
ధర్మారం, ఏప్రిల్8: ధర్మపురి నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. గురువారం ధర్మారం మండలం కొత్తూరులో పర్యటించిన మంత్రి ఈశ్వ ర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఎల్ఎం చారిటబుల్ ట్రస్టు తరఫున ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలం దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతీ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఎంపీపీ కరుణశ్రీ, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, ఎంపీడీవో బీ జయశీల, ప్రజాప్రతినిధులు, అధికారులు, జీపీ కార్యదర్శుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవోను సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పూస్కూరు జితేందర్రావు ఆధ్వర్యంలో గజమాలతో ముగ్గురిని మంత్రి ఈశ్వర్ సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశానని, చేస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా కోట్లాది నిధులు వె చ్చించి సాగు నీటి సమస్యను పరిష్కరించామని, మిగిలి ఉన్న సమస్యలు కూడా త్వరలో పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరందిస్తామన్నారు. తాను మంత్రిగా ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో ఉ న్న ధర్మారం మండలం, అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జాతీయ స్థాయికి ఎంపికకావ డం అభినందనీయమని ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రశంసించారు.
అందరి సమష్టి కృషి, పల్లె ప్రగతి కింద సీఎం కేసీఆర్ నెలనెలా 337 కోట్లు విడుదల చేయడంతోనే మండలానికి అవా ర్డు వచ్చిందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అభివృద్ధికి సంపూర్ణ సహకారమందిస్తానని అభయమిచ్చారు. మండలానికి అవార్డు వచ్చినందున అన్ని గ్రామాలో జీపీ పాలకవర్గ సభ్యులను, జీపీ కార్మికులను, వివిధ శాఖల సి బ్బందిని సన్మానించాలని సూచించారు. ఇక్కడ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ప్యాక్స్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు పూస్కూరు జితేందర్రావు, మి ట్ట తిరుపతి, తాసిల్దార్ పీ సంపత్, ఏఎంసీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సలామొద్దీన్, పాలకుర్తి ఎంపీపీ వ్యాళ్ల అనసూర్య, వెల్గటూరు ఏఎంసీ చైర్మన్ ఎలేటి క్రిష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు
న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ కమెడియన్ వినోద్