మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం చాప్ల తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తండాలోని ఓ వ్యవసాయ బావిలో పడి బుక్యా జాన్ వెస్లీ(15) అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.