టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మెరుగైన రికార్డు కలిగిన విరాట్ ఐపీఎల్లోనూ అద్భుత ట్రాక్ నమోదు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 184 ఇన్నింగ్స్ల్లో 130.73 స్ట్రైక్ రేట్తో 38.16 సగటుతో 5878 పరుగులు చేశాడు. కోహ్లీ సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాదైనా టైటిల్ నెగ్గాలని భావిస్తోంది.
ఐపీఎల్లో కోహ్లీ ఇంకో 122 పరుగులు చేస్తే టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్మన్గా అవతరిస్తాడు. ప్రస్తుతం రన్మెషీన్ 184 ఇన్నింగ్స్లలో 5878 పరుగులు చేశాడు. అతని తర్వాత జాబితాలో సురేశ్ రైనా, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేశాడు.లీగ్లో విండీస్ హార్డ్హిట్టర్ క్రిస్గేల్ ఆరు శతకాలు బాదేశాడు. ఇందులో 2016 ఎడిషన్లోనే నాలుగు సెంచరీలు కొట్టాడు.