ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కథానాయిక నివేదా థామస్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ‘ కరోనా పరీక్షలో నాకు పాజిటివ్గా తేలింది. స్వీయ నిర్భంధంలో ఉన్నా. వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా నుంచి పూర్తిగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నా. నా మెడికల్ టీమ్ చక్కటి శ్రద్ధ తీసుకుంటున్నారు’ అని ట్విట్టర్ ద్వారా నివేదా థామస్ ప్రకటించింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘వకీల్సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకురానున్నది.