గువాహటి : అసోం అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. తొలి విడత 47 నియోజకవర్గాల్లో ఎన్నికలు శనివారం జరుగనుండగా.. కొవిడ్ ప్రోటోకాల్స్ మేరకు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో 81,09,815 మంది ఓటు వేయనుండగా.. ఇందులో 40,77,210 మంది పురుష ఓటర్లు, 40,32,481 మంది మహిళా ఓటర్లు, 114 ట్రాన్స్జెండర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మొదటి దశలో 264 మంది అభ్యర్థులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. కరోనా మహమ్మారి వేళ ఈసీ ఓ పోలింగ్ బూత్లో వెయ్యి ఓట్లకు కుదించింది. 11,537 పోలింగ్ కేంద్రాలు జరుగనుండగా.. థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్లు, సబ్బులు.. సిబ్బందిక మాస్క్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు చెప్పింది. ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ స్టేషన్లలో భారీ భద్రతా బలగాలను మోహరించినట్లు దిబ్రూగఢ్ డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ ఝా తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయని, ప్రజలు ప్రశాంత వాతావరణం ఓట్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.