కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనం (ముస్లింలు) 30 శాతం, వారు (హిందువులు) 70 శాతం. 70 శాతం జనాభా మద్దతుతో వారు అధికారంలోకి వస్తున్నారు. దీనికి వారు సిగ్గుపడాలి. మన ముస్లిం జనభా అంతా ఒక్కచోటకు చేరితే మనం నాలుగు పాకిస్థాన్లను సృష్టించగలం. 70 శాతం జనాభా ఉన్న వారు (హిందువులు) అప్పుడు ఎక్కడికి వెళ్తారు?’ అని షేక్ ఆలం ప్రశ్నించారు. కాగా ఆయన చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు.