బెంగళూరు: ఆర్ఎస్ఎస్ ‘సర్కార్యవాహ్’ (ప్రధాన కార్యదర్శి)గా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలె ఎన్నికయ్యారు. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన ఆర్ఎస్ఎస్ అత్యున్నత నిర్ణాయక సంఘమైన అఖిల భారతీయ ప్రతినిధి సభ వార్షిక సమావేశాల్లో ఈ ఎన్నిక జరిగింది. సురేశ్ భయ్యాజీ జోషి స్థానంలో హోసబలె బాధ్యతలు చేపట్టనున్నారు. ఆర్ఎస్ఎస్లో నంబర్ 2 స్థానాన్ని చేపట్టనున్న రెండో కన్నడిగుడు హోసబలె. గతంలో అదే రాష్ర్టానికి చెందిన హెచ్వీ శేషాద్రి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మరోవైపు బీజేపీ నేత రాంమాధవ్ను తిరిగి ఆర్ఎస్ఎస్లోకి తీసుకున్నారు. ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు.