మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యాశాఖ కరోనాపై సమరానికి సిద్ధమైంది. ప్రత్యక్షంగా పాఠాలు బోధించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతితో మార్చి 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎక్కడా పెద్ద గా సమస్యలు రాలేదు. అయితే, రెం డు రోజులుగా రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పాజిటివ్ రావడంతో ప్రభు త్వం అప్రమత్తమైంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. విద్యార్థుల కు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని అధికారులకు సూచించింది. కరో నా మహమ్మారి తిరిగి విజృంభిస్తున్న తరుణంలో అందరూ అప్రమత్తమవుతున్నారు. దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నిత్యం క్రమం తప్పకుండా కేసులు పె రుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియ ర్ కళాశాలల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 6 నుంచి ఆపైన తరగతుల విద్యార్థులు ప్రస్తుతం పాఠశాలలకు వెళ్తున్నారు. క రోనా నిబంధనల మేరకు విద్యాబోధ న కొనసాగుతున్నది. అయినా ఆయా జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్న దృష్ట్యా అన్ని పాఠశాలల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చూస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కళాశాలల్లో 4,30, 037 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరితోపాటు ఉపాధ్యాయులు, సిబ్బందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. ఇందు లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లు ని ర్ధారణ అయితే తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నిత్యం పర్యవేక్షించాలి..
హెచ్ఎంలు, కళాశా ల ప్రిన్సిపాళ్లు విద్యార్థు ల ఆరోగ్యాన్ని నిత్యం ప ర్యవేక్షించాలని ఆదేశిం చాం. రెసిడెన్షియల్, కే జీబీవీ, పాఠశాలలు, ప్ర భుత్వ కళాశాలలు, హా స్టళ్లు అన్నిచోట్లా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాం. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించేలా, శానిటైజర్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. త్వరితగతిన సిలబస్ పూర్తి చేయడంపై హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలి.