చిక్కడపల్లి, మార్చి12: 14న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు, సమర్థవంతగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శుక్రవారం గాంధీనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ బూత్ ఏజెంట్లు ఆయా బూత్ల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్లు పూర్తిస్థాయిలో హాజరవుతున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని తెలిపా రు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు, పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్రావు ఈ 6 సంవత్సరాల్లో పట్ట భద్రులకు చేసింది ఏమీ లేదని అన్నారు. ఓటర్లును మాయమాటలతో మభ్యపెట్టేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, మార్చి12: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వా ణీదేవికి ఓటు వేసి గెలిపించాలని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య పట్టభద్రులను కోరారు. మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్లిగంపల్లిలోని వీఎస్టీ యూనియన్ కార్యాలయంలో ప్రచార కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయు లం దరూ సురభి వాణీదేవికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశోక్రెడ్డి, టీఆర్ఎస్ రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు రేషం మల్లేశ్, ప్రధాన కార్యదర్శి కిరణ్, ప్రకాశ్రెడ్డి, మధు, సందీప్, విక్కి, సత్యనారాయణ, అమిత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు మిద్దె సురేశ్ అధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం శుక్రవారం నగర గ్రంథాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు చాప భాస్కర్, శ్రీకాంత్, జంగయ్య, నాగరాజు, వెకంటేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
కవాడిగూడ, మార్చి 12: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్ట భద్రుల నియోజక వర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సురభి వాణీదేవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం భోలక్పూర్లోని పీఅండ్టీ కాలనీ, సంజీవయ్య నగర్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి పట్ట భద్రులను కలిసి సురభి వాణీదేవికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముఠా జయసింహ, మహ్మద్ అలీ, వై. శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.
రంగానగర్లో…. భోలక్పూర్ డివిజన్ రంగానగర్లో టీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ తిరిగి పట్ట భద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. ముప్పిడి నర్సింగరావు, పానుగంటి మహేశ్కమార్ పాల్గొన్నారు.
వాణీదేవికి మద్దతుగా ప్రచారం
ముషీరాబాద్, మార్చి 12: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చివరి రోజు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎంఎన్ . శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్లు కాలనీల్లో తిరుగుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటువేసి గెలిపించాలని కోరారు. అడిక్మెట్ డివిజన్ విద్యానగర్లో మహిళానేతలు ప్రేమలతారెడ్డి, కె. అనూరాధ, కె. ప్రసన్న, రోశం బాలు, కొండపల్లి మాధవ్ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.