ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
నల్లగొండలో మెగా జాబ్మేళాకు విశేష స్పందన
నీలగిరి, జూలై 17 : గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళా అద్భుతమైన కార్యక్రమమని, ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలోని లక్ష్మీగార్డెన్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 1,200మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం శుభపరిణామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 1.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, మరో 50వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్లు తయారు చేస్తుందన్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నల్లగొండలో జాబ్మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3,700 మంది నిరుద్యోగులు హాజరు కాగా 62 కంపెనీల ప్రతినిధులు వచ్చి వారి అర్హతను బట్టి ఎంపిక చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు యాదవ్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్రా సుధాకర్, కనగల్ ఎంపీపీ కరీంపాషా, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు అభిమన్యు శ్రీనివాస్, ఉట్కూరి వెంకట్రెడ్డి, ఆలకుంట్ల మోహన్బాబు, చీర పంకజ్యాదవ్, కటికం సత్తయ్యగౌడ్, కొండూరు సత్యనారాయణ, బోనగిరి దేవేందర్, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, రావుల శ్రీనివాస్రెడ్డి, వంగాల సహదేవ్రెడ్డి, పాశం సంపత్రెడ్డి, లకడపురం వెంకన్న, దోటి శ్రీనివాస్, పల్రెడ్డి రవీందర్రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకట్రెడ్డి, సుధాకర్, జాబ్స్ ఎంబీసీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కాసర్ల రవితేజ, కో-ఆర్డినేటర్ ప్రబంధరెడ్డి, ఎస్బీఐ హెచ్ఆర్ చందర్ పాల్గొన్నారు.