హాలియా, ఆగస్టు 1 : హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో సీఎం ప్రగతి సమీక్షా సమావేశం ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హాలియాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత శాసన సభ ఉప ఎన్నికల సమయంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాలియాకు వస్తున్నట్లు తెలిపారు. గత ఐదు నెలల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రావడం ఇది మూడోసారి అని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో ప్రేమ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు గత శాసన సభ ఉప ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు జానారెడ్డిని ఓడించడంతో నియోజకవర్గ ప్రజల మీద నమ్మకం, విశ్వాసం మరింత పెరిగిందన్నారు. వారి వెంట మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్సింగ్, నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, పెద్దవూర జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బొల్లేపల్లి శ్రీనివాస్రాజు, యడవెల్లి మహేందర్రెడ్డి, కర్ణ బ్రహ్మారెడ్డి, రాంబాబు, శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణరెడ్డి ఉన్నారు.