పెద్దవూర, మార్చి 27: తెలంగాణ ప్రభుత్వం ప్రజల కు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే, ఇన్చార్జి బాల్క సుమన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆర్ఎంపీలు, ప్రైవేటు ఉపాధ్యాయులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందని ఇంకా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని అన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఆర్ఎంపీలకు మండల కేంద్రంలో భవనం నిర్మిస్తామన్నారు. నిరుద్యోగ భృతి కోసం సీఎం అధ్యక్షతన సన్నాహకాలు జరుగుతున్నాయన్నారు.
గ్రామాల్లో టీఆర్ఎస్కు బ్రహ్మరథం
గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మండలంలోని పోతునూర్ గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గతంలో పాలించిన నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి ,పార్టీ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, పీఏసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్రెడ్డి, జటావత్ జ్యోతీకృష్ణ, నాయకులు కొండల్రావు వెంకటేశ్వర్రావు సుందర్రెడ్డి, బోయ నరేందర్రెడ్డి, షేక్ అబ్బాస్, మిట్టపల్లి ప్రదీప్రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు