నల్లగొండ సిటీ/ నందికొండ, జూలై 19 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2021ని నిలిపివేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ ఏస్ఈ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తుందన్నారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 1104 యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్.వెంకటయ్య, 327 యూనియన్ జిల్లా కార్యదర్శి సురేశ్కుమార్, ఇంజినీర్స్ అసోసియేషన్ నాయకులు నరేశ్కుమార్, ఏఈ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, నరేంద్రర్ రాజు పాల్గొన్నారు. నందికొండ పైలాన్కాలనీలోని జెన్కో కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఇంజినీర్ల అసోసియేషన్ (టీఎస్పీఈఏ) ఇన్చార్జి కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు ఆమోదంతో విద్యుత్ సంస్థలు నిర్వీర్యం అవుతాయన్నారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.