నీలగిరి, జూలై 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్య సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని అన్నారు. ఇప్పటివరకు ప్రజారోగ్య ఎస్ఈ కార్యాలయం హైదరాబాద్లో ఉండడం వల్ల మున్సిపాలిటీల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇక ఇబ్బంది ఉండదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, కౌన్సిలర్ మారగోని నవీన్గౌడ్, టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బీజేపీ ఫ్లోర్లీడర్ బండారు ప్రసాద్, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, ఊట్కూరి వెంకట్రెడ్డి, ఎడ్ల శ్రీనివాస్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, డీఈ మనోహర్, వెంకన్న, ఏఈలు జహీర్, నాగప్రసాద్, వినోద్కుమార్, దిలీప్, ఆండాలమ్మ పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ..
రామగిరి : నల్లగొండలోని మదీనా మసీద్లో తలసేమియా సొసైటీ పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రారంభించారు. 300మంది రక్తదానం చేశారు. ముస్లిం మతపెద్ద మౌలానా ఎహ్సనుద్దీన్, మౌలానా అబ్దుల్ బషీర్, దర్శకుడు తన్వీరుల్బనాత్, బండారు ప్రసాద్ పాల్గొన్నారు.