దేవరకొండ, జూలై 13 : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఎంకేఆర్ కళాశాలలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కళాశాల అభివద్ధికి రూ.2 కోట్లు మంజూరయ్యాయని, రూ.1.20 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ. 80 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, శాంసన్, పగిడిమర్రి రఘురాములు, బెజవాడ శేఖర్, పొలిశెట్టి భిక్షపతి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, తౌఫిక్, ప్రిన్సిపాల్ రామరాజు, అధ్యాపకులు పాల్గొన్నారు
గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక నిధులు కేటాయిస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన జనరల్బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున కేటాయించారని, వాటితో గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పలు సమస్యలను సర్పంచులు సభ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీపీ పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ బాలూనాయక్, వైస్ ఎంపీపీ ఆరెకంటి ముత్యాలమ్మ, ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మి, తాసీల్దార్ సీతామహాలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు తిరుపతయ్య, ఎంఈఓ సామ్యానాయక్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.