మాల్, సెప్టెంబర్21 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దొంతం చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉజ్జిని నరేందర్ రావును ఎన్నికయ్యారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంకట్రెడ్డి, సాగర్రావు, గోపిడి కృష్టారెడ్డి, నట్వ గిరిధర్, గున్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, బాదేపల్లి పులిరాజు, పూల యాదయ్య, మాస భాస్కర్, శ్రీశైలం, సుమతీరెడ్డి, పురుషోత్తంరెడ్డితో పాటు వివిధ గ్రామాల కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ మిర్యాలగూడ పట్టణ కమిటీ
టీఆర్ఎస్ మిర్యాలగూడ పట్టణ కమిటీని మంగళవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది శ్రీనివాస్గౌడ్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహ్మద్ ఖాదర్, మన్నెం శ్రీనివాస్రెడ్డి, ఉబ్బపల్లి మధుసూదన్రావు, కోల వెంకన్న, బొడ్డు నందకిశోర్యాదవ్, అధికార ప్రతినిధిగా పిన్నబోయిన శ్రీనివాస్యాదవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా పునాటి లక్ష్మీనారాయణ, నాగేందర్, టి.వేణుగోపాల్రావు, కృపాకర్రెడ్డి, వై.వేణుగోపాల్రావు, మహ్మద్ ఫహిమొద్దీన్, రాములు, చాంద్పాషా, ఆంజనేయరాజు, షేక్ ఖాజా, వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, ప్రచార కార్యదర్శులుగా రేపాల రమేశ్, ఏడుకొండలు, విజయ్, శ్రీనివాస్, వెంకన్నయాదవ్, కోషాధికారులుగా సాంబశివరావుతో పాటు 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
డిండి మండలాధ్యక్షుడిగా వెంకటేశ్వర్రావు
డిండి : టీఆర్ఎస్ మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజినేని వెంకటేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా పేర్వాల జంగారెడ్డి, రమావత్ వెంకట్రాం, బాదమోని శ్రీనివాస్గౌడ్, గోపాల్రావు, ప్రధాన కార్యదర్శిగా భాస్కర్రెడ్డి, అధికార ప్రతినిథిగా ఇడికుడ రాఘవాచారి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా లట్టుపల్లి శేఖర్రెడ్డి, ఎండీ.అల్లావుద్దీన్, గొడుగు వెంకటయ్య, సంయుక్త కార్యదర్శులుగా కృష్ణయ్య, కొర్ర పాండు, సూదిని కృష్ణారెడ్డి, కోశాధికారిగా కందుకూరి సూరి, యూత్ అధ్యక్షుడిగా మల్రెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, మైనార్టీసెల్ అధ్యక్షుడిగా ఎంఏ. కలీం, ఎస్టీసెల్ అధ్యక్షుడిగా బిచ్యానాయక్ ఎన్నికయ్యారు.
బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా మహేందర్
పెద్దఅడిశర్లపల్లి : టీఆర్ఎస్ బీసీసెల్ మండలాధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన బొడ్డుపల్లి మహేందర్ను ఎన్నుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వల్లపురెడ్డి ఆయనకు నియామకపత్రం అందించారు.
కొండమల్లేపల్లి అధ్యక్షుడిగా దస్రూనాయక్
కొండమల్లేపల్లి(దేవరకొండ), సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ మండలాధ్యక్షుడిగా రమావత్ దస్రూనాయక్, ప్రధాన కార్యదర్శిగా పసునూరి యుగేంధర్రెడ్డి, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అర్హులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పని చేస్తామని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శిగా తిరుమల్
తిరుమలగిరి సాగర్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా పోతుగంటి తిరుమల్ను నియమిస్తున్నట్లు ఎమ్మెల్యే నోముల భగత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ మండలాధ్యక్షులుగా పోలేపల్లి సత్తయ్య, ఇస్లావత్ సీత్యా, మేకపోతుల కార్తీక్ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తిరుమల్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో రెండోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.