చందంపేట, జూలై 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల్లిలో రైతు వేదిక భవనాన్ని, చంద్రూ నాయక్ తండాలో రూ. 99 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు, వెంకట్నాయక్ తండాలో పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో మూడు రైతు వేదికలు పూర్తయ్యాయన్నారు. రైతు వేదికలో వ్యవసాయాధికారులు ప్రతి నెలా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు పంటలపై అవగాహన కల్పించాలన్నారు.రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ పవిత్ర, ఎంపీడీఓ రాములు నాయక్, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శిరందాసు లక్ష్మమ్మాకృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ బాలయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు నాగిళ్ల జంగమ్మ, అనంతగిరి, శంకర్రావు. అనురాధానారాయణరెడ్డి, కొండల్రెడ్డి, నాగార్జున, లోక్యనాయక్, ఎంపీటీసీ మంజుల, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, శంకర్ నాయక్, మకట్లాల్, మోహన్కృష్ణ, రమేశ్, పంచాయతీ రాజ్ ఏఈ రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ముత్యాల రవి, ఏఓ మల్లారెడ్డి, ఏఈఓలు ప్రవీణ్, వనజ ఉన్నారు.