నాంపల్లి, జూలై 22 : మండలంలోని రాందాస్తండా గ్రామానికి చెందిన మెగావత్ రాంజీ, నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్కే చోటమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి గురువారం పరామర్శించి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట సర్పంచ్ బోయపల్లి జయమ్మ, ఎంపీటీసీ దాసరి సాలమ్మ, బోయపల్లి చంద్రయ్య, నాయకులు వీరమళ్ల భిక్షం, సపావత్ తౌర్య, హన్మంతు, తిరుమలయ్య, సైదయ్య, శంకరయ్య, పరమేశ్, రమేశ్ ఉన్నారు.
సైదులు కుటుంబానికి..
నార్కట్పల్లి : మండలంలోని నెమ్మాని గ్రామానికి చెందిన రూపని సైదులు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులను గురువారం ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట బుర్రి ఎల్లేశ్, మల్లేశ్, కృష్ణ ఉన్నారు.
గిరి కుటుంబానికి..
మునుగోడు : మండలంలోని చల్మెడకు చెందిన లారీ డ్రైవర్ గాదెపాక గిరి ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీరామ్ లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు గిరి కుటుంబానికి రూ.10 వేల సాయాన్ని గురువారం అందించారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి జక్కర్తి లింగస్వామి, కట్ట స్వామి, నెల్లికంటి పరమేశ్, రాజు, గాదెపాక బాలరాజు, సురేశ్, శేఖర్, శంకర్ పాల్గొన్నారు.