హాలియా, జూలై 20 : ప్రభుత్వం హాలియాలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలను నియోజకవర్గ విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజలు 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. దివంగత నోముల నర్సింహయ్య విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్కు హాలియాకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేశారన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ నెల 24వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం అనుముల గ్రామానికి చెందిన పి. క్రాంతికి చికిత్స నిమిత్తం రూ.3 లక్షల ఎల్ఓసీని అందించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ సుమతీ పురుషోత్తం, ఇన్చార్జి ప్రిన్సిపాల్ రవికుమార్, టీఆర్ఎస్ నాయకులు మల్గిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, నల్లగొండ సుధాకర్, వార్డు కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, ప్రసాద్ నాయక్, అన్నెపాక శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు చాపల సైదులు, డోమినిక్ పాల్గొన్నారు.
ఎస్హెచ్జీ స్టోర్ ప్రారంభం
మండలంలోని కొంపల్లి గ్రామంలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎస్హెచ్జీ స్టోర్స్ను ఎమ్మెల్యే నోముల భగత్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ.కోటిరెడ్డి, ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, వైస్ ఎంపీపీ దిలీప్రెడ్డి, తాసీల్దార్ పాండునాయక్, ఎంఈఓ తరి రాము, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ శాగం రాఘవరెడ్డి, సర్పంచ్ శ్రవణ్కుమార్రెడ్డి, సుంకిశాల సర్పంచ్ కేతావత్ జ్యోతీరామకృష్ణ, ఎంపీటీసీలు సుజాతాపాండునాయక్, ఎస్ఐ సుధాకర్, ఎస్ఎంసీ చైర్మన్ ఇరిగి నాగయ్య పాల్గొన్నారు.