అర్వపల్లి, జూలై 23 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలో శనివారం నిర్వహించే వేడుకలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హాజరవుతున్నట్లు జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ తెలిపారు. మండలంలోని అర్వపల్లి శివారులో జాతీయ రహదారి వెంట ముక్కోటి వృక్షార్చన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా జాజిరెడ్డిగూడెం గ్రామ శివారులోని నకిరేకల్-తానంచర్ల రహదారి వెంట మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చనను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం గిఫ్ట్ ఎ స్మైల్లో భాగంగా ఎమ్మెల్యే కిశోర్ అందించిన రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను దివ్యాంగులకు పంపిణీ చేస్తారని చెప్పారు. టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, టీఆర్ఎస్ నాయకులు రామలింగయ్య, శ్రీనివాస్, ప్రభాకర్ పాల్గొన్నారు.