నందికొండ, జూలై 22 : నాగార్జునసాగర్లోని జెన్కోలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో పైలాన్కాలనీలోని కొత్త వంతెనపై జెన్కో ఉద్యోగి మండారి రామయ్య (36) ద్విచక్రవాహనం, సెల్ఫోన్ను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విష యం తెలుసుకున్న పోలీసులు రామయ్య నివాసం ఉంటున్న జెన్కో క్వార్టర్ను తనిఖీ చేయగా తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక, ఆరోగ్యపరమైన కారణాలతో చనిపోతున్నట్లు సూసైడ్నోట్లో పేర్కొన్నట్లు గమనించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న మండారి రామ య్య, ఆయన భార్య నాగమణి(30), కొడుకు సాత్విక్(12) ఆచూకీ కోసం ఉదయం నుంచి కృష్ణానదిలోని కొత్త వంతెన సమీపంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా వారి మృతదేహాల ఆచూకీ లభించలేదు. నాగార్జునసాగర్లో జోరుగా కొనసాగుతున్న ఆన్లైన్ బిజ్నెస్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతోనే చనిపోయినట్లుగా సూసైడ్నోట్లో పేర్కొన్నాడని, పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్నోట్ రామయ్య రాసింది కాదని, అప్పటికే సూసైడ్నోట్ను తారుమారు చేశారని పలువురు అను మానం వ్యక్తం చేస్తున్నారు.