ఊర్కొండ: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో గ్రామాల రూపురేఖల్లో ఘనణీయమైన మార్పు వచ్చిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో వాల్మీకి జయంతిలో పాల్గొని నివా ళులర్పించారు. ఆనంతరం మండలంలోని జగబోయిన్పల్లిలో పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్లను ప్రారంభిం చారు. ఆనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయి గణేశ్ కాటన్ జిన్నింగ్ మిల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అములు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు ఎంతో అబివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ.రాధ, వైస్ ఎంపీపీ.అరుణ్కుమార్ రెడ్డి, కో అప్షన్ ఖలీం, పాషా, సర్పంచ్లు కవితారెడ్డి, రాజయ్య, ఆంజనేయులు, ఎంపీటీసీ గోపాల్ గుప్తా, టీఆర్ఎస్ నాయకుడు జనార్దన్రెడ్డి, టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు, గిరినాయక్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు రమేశ్, నాగోజి, వెంకటేశ్, శ్రీను పాల్గొన్నారు.