నాగర్కర్నూల్: ఆపద సయమంలో అండగా నిలిచే అంబులెన్సులను కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. తము చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలను అంబులెన్సు ద్వారా చేస్తే ఎవరూ గుర్తించలేరు అనుకున్నారో ఏమో.. ఆలస్యంగా నైనా పోలీసులకు బుక్కయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం, స్పటికను అంబులెన్సులో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వెల్దండ పోలీస్ స్టేషన్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటుగా వచ్చిన అంబులెన్సును పరిశీలించగా అందులో బెల్లం, స్పటిక బయటపడ్డాయి. దీంతో అంబులెన్సు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. దానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం రాబడుతున్నారు. కేసు నమోదుచేఇస దర్యాప్తు చేస్తున్నారు.