వెల్దండ: 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణకు స్వతంత్రం తెచ్చిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కల్వ కుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండల కొట్రగేట్ వద్ద అశోక్ రెడ్డి ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎంపీ రాములుతో పాటు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోలి శ్రీనివాస్ రడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతు బంధు సమితి అధ్యక్షుడు, పార్టీ మండల అధ్యక్ష ,కార్యదర్శులు, అనుబంధ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండా అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్య మంత్రి కేసీఆర్ తన ప్రాణాలను లెక్క చేయకుండా 14ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణను సిద్ధించేందుకు కృషి చేసిన మహనీయుడని అన్నారు.
గాంధీ పంతంతో 14 ఏండ్లు పోరాడి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపితగా నిలిచిండని అన్నారు. కేసిఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని, కారణజన్ముడని జైపాల్యాదవ్ అభివర్ణించారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు.
ఎంపీ రాములు మాట్లాడుతూ.. 60 లక్షల సైన్యం ఉన్న అతి పెద్ద పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. 140 ఏండ్ల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ దేశానికి, రాష్ర్టానికి చేసింది ఏమి లేదని అన్నారు. జాతీయ పార్టీ బీజేపీ దేశానికి ఏం చేసిందో పెట్రోల్, డీజిల్, సిలిండర్ను అడిగితే చెబుతాయ ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ పాలనలో ప్రజలపై ఎనలేని భారం పడింది అని ఆరోపించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బృహత్తర సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవు తున్నాయని అన్నా రు. జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ నేత గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే హక్కు ఇతర పార్టీలకు లేవన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీలు భరత్ ప్రసాద్, దశరత్ నాయక్, విజితా రడ్డి, ఎంపీపీలు విజయ, సునీత, రైతు బంధు అధ్య క్షుడు భాస్కర్ రావు, వీరే గౌడ్ నారాయణ, దశరథ్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్ గౌడ్, పీఎసీఎస్ చైర్మన్ సంజీవ్ యాదవ్, వెల్దండ టీఆర్ఎస్ అధ్యక్షుడు భూపతి రెడ్డి, జయప్రకాశ్, అలీ, ఆర్కే గౌడ్, యాదగిరి, రవీందర్ రావు, బోజ్జయ్య, శ్రీకాంత్ ముదిరాజ్, ప్రదీప్ యాదవ్, కౌన్సిలర్లు బాలు నాయక్, యాదమ్మ శ్రీనివాస్, మధు, ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు.