వెల్దండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్ల కుంటుంబాలకు వరమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలోని ఏవీఆర్ గార్డెన్లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హజరై 113మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం పేదల పాలిట వరమని అన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ఆడపడుచులకు తోబుట్టువులా ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింట ఆడపిల్లల పెండ్లి కి రూ.1.00116 అందజేస్తున్నాడన్నారు. పేదల సంక్షేమాభివృద్ధే కేసీఆర్ లక్ష్యమన్నారు.. కార్యక్రమంలో ఎంపీపీ విజ య, వైస ఎంపీపీ శాంతి, మండల రైతుబంధు అధ్యక్షుడు భాస్కర్ రావు, తాసీల్దార్ కృష్ణ, ఆర్ఐ శేఖర్, సర్పంచ్ల సం ఘం అధ్యక్షుడు భూపతి రెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యాదగిరి, నాయకులు రవిగౌడ్, రాధాకిషన్గౌడ్, తిర్మల్ రావు, రాజశేఖర్, ఎస్ఐ నర్సిహులు తదితరులు పాల్గొన్నారు.