వంగూరు: పేదింటి ఆడపడచలకు మేనమామ సీఎం కేసిఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాల్రాజ్ అన్నారు. శనివారం మండలంలోని తిప్పారెడ్డిపల్లి శివారులోని విహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విప్ ముఖ్య అతిథిగా హాజరై 26 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ భీమమ్మ, తాసీల్దార్ రాజునాయక్, డీటీ రవూఫ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నరేందర్రావ్, సింగిల్విండో అధ్యక్షుడు సురేందర్రెడ్డి, జడ్పీ కో-అప్షన్ హామీద్తో పాటు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.