వెల్దండ: దైవ భక్తి పెంపోందించుకున్నపుడే మానసిక ప్రశాంతంత దొరుకుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వెల్దండ మండలం నాగురావుపల్లి తండాలో తుల్జా భవాని అమ్మవారి విగ్రహా ప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం, మహా కుంభాభిషేక కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నేత గోళి శ్రీనివాస్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ధైవ భక్తి పెంపొందించుకోవాలన్నారు. దైవ భక్తితో ప్రశాంతత లభి స్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ భాస్కర్రావు, మండల రైతుబంధు అధ్యక్షుడుభాస్కర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపతిరెడ్డి, ఆమనగల్లు మార్కె ట్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు అంజీనాయక్, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.