అచ్చంపేట, జూన్ 22: అచ్చంపేట నియోజకవర్గంలో 8ఎకరాలలోపు ఉన్న 86వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. అచ్చంపేట మండలంలోని 15,925మంది రైతులకుగానూ 14,667 మంది ఖాతాల్లో రూ.18,33,94,005 జమ అయ్యా యి. అమ్రాబాద్ మండలంలో 7,79 1మంది రైతులకుగానూ 7,378 మం ది ఖాతాల్లో రూ.8,91,34,617 జమయ్యాయి. బల్మూర్ మండలంలో 14, 728మందికి గానూ 13,672 మంది ఖాతాల్లో ప్రభుత్వం రూ.16, 70,92,573 జమ చేసింది. లింగాల మండలంలో 10,981మందికిగానూ 9,565 మంది ఖాతాల్లో రూ.13, 16,96,702 జమయ్యాయి. పదర మండలంలో 5,698 మందికి గానూ 5,403 మంది ఖాతాల్లో రూ.7, 19,20,986 జమ కాగా ఉప్పునుంతల మండలంలో 15,732 మందికిగానూ 14,570 మంది ఖాతాల్లో రూ. 18,45,93,476 జమయ్యాయి. వంగూరు మండలంలో 15,304 మంది రైతులకుగానూ 13,614 మంది ఖాతాల్లో రూ.18,23, 51,175 పడ్డాయి. చారకొండ మండలంలో 7,873మంది రైతులకుగానూ 7,064మంది ఖాతాల్లో రూ.8,73, 79,433 జమయ్యాయి. రైతుబంధు డబ్బులు తీసుకునేందుకు రైతులు మంగళవారం బారులుదీరడంతో నియోజకవర్గంలోని అన్ని బ్యాంకులు రైతులతో కిటకిటలాడుతున్నాయి.
కొవిడ్ నిబంధనలు పాటించాలి
సోమవారంనాటికి లింగాల మండలంలో 10,981మందికిగానూ 9,565మంది రై తులకు రూ.13కోట్ల 16లక్షల 96,802 జమయ్యాయి. మిగిలిన రైతుల ఖాతాలో క్రమంగా నగదు జమవుతుంది. 10 డిసెంబర్ 2020 నుంచి 10జూన్ 2021 వరకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వారికి ఈ నెలాఖరు వరకు రైతుబంధు సాయం జమ కానున్నది. బ్యాంకు వద్ద రైతులు కరోనా నిబంధనలు పాటించాలి. సమన్వయంతో భౌతికదూరం పాటించి, మాస్కులు ధరించి క్యూలో నిల్చొని నగదు తీసుకోవాలి.