కల్వకుర్తి రూరల్, జూన్ 22: మండల అభివృద్ధికి కృషి చేస్తున్న జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్వకుర్తి జెడ్పీటీసీపై నిరాధార వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కల్వకుర్తి మండల గిరిజన ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం పట్టణంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజల మద్య తిరుగుతూ వారి కోసం పని చేస్తున్న వ్యక్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్యాదవ్ అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తన గ్రామంలో ఇటీవల జరిగిన అభివృద్ధి పనులు, సబ్స్టేషన్ ప్రారంభం కండ్లకు కనబడడం లేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, పదవిలో ఉండి ఏపాటి అభివృద్ధి చేశారో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత విమర్శలు చేయాలని హితవు పలికారు.
అవగాహన లేకుండా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సరైంది కాదన్నారు. జెడ్పీటీసీపై విమర్శలు చేసే స్థాయి ఆయనది కాదని, ఇకపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. సమావేశంలో గిరిజన ప్రజాప్రతినిధులు రమేశ్నాయక్, సోమ్లానాయక్, గూండ్యానాయక్, శక్రునాయక్, శంకర్నాయక్, రాజునాయక్, బిచ్చునాయక్, మంగ్యనాయక్ తదితరులు ఉన్నారు.