ఊట్కూర్, మే 28 : జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొగ్దుంపూర్ వన నర్సరీని శుక్రవారం అధికారులు సందర్శించారు. నర్సీరీలోని మొక్కలకు అధికారులు నీళ్లు పట్టారు. ఎంపీడీవో కాళప్ప మాట్లాడుతూ ప్రభు త్వం ప్రతిష్టాత్మంగా నిర్వహించే 7వ విడుత హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టి కృషితో విజయవంతం చేయాల ని కోరారు. వాననీటి పరిరక్షణతో భూగర్భ జలా లు పెరుగుతాయని సూచించారు. కార్యక్రమం లో సర్పంచ్ సుశీలమ్మ, ఉపసర్పంచ్ వెంకట్రాములు పాల్గొన్నారు.