తెలకపల్లి, ఏప్రిల్ 27: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ కష్టకాలంలోనూ రైతుకు అండగా నిలుస్తున్నదని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలయం వద్ద మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతేడాది లాక్డౌన్ సమయంలో ధాన్యం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అండగా నిలిచామన్నారు. ఈ ఏడాది కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా జలాలు తరలించి సస్యశ్యామలం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హనుమంతురావు, ఎంపీపీ మధు, సింగిల్ విండో చైర్మన్ భాస్కర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నరేందర్రెడ్డి, సింగిల్విండో కార్యదర్శి ధర్మవీర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బంగారయ్య, రాములు, ఉపసర్పంచ్ కృష్ణ, రైతులు పాల్గొన్నారు.