మూసాపేట, మే 27: తోటి సర్పంచ్ కష్టకాలంలో ఉన్నారని తెలిసి జిల్లా సర్పంచులంతా ఐక్యతతో ముం దుకొచ్చి ఆర్థికసాయం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభినందించారు. మండలంలోని సంకలమద్ది సర్పంచ్ దేవరకొండ స్వరూప భర్త మాజీ సర్పంచ్ బాలరాజ్ ఇటీవల కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తె లుసుకున్న జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రణీల్చందర్ ఆధ్వర్యంలో సర్పంచులంతా కలిసి బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎవరికి తోచినంత వారు తమవంతు సాయం చేయగా, మొత్తం రూ.లక్షా 84వేలు పోగైంది. గురువారం సర్పంచ్ స్వరూ ప ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేతులమీదుగా ఆర్థికసాయం అందజేశారు. ఎమ్మెల్యే కూడా తనవంతు సాయంగా రూ. 30వేల చెక్కు అందించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఆయా మం డలాల సర్పంచుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.