అచ్చంపేట రూరల్, మే 25: దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్తో చిన్నాభిన్నమైన చిన్నతరహా పరిశ్రమలను ఆదుకోవాలని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత మిలింద్ కాంబ్లే కోరారు. పట్టణంలోని సురక్ష ప్రజా వైద్యశాలలో కరోనా బాధితులకు సేవ చేయడమే ధ్యేయంగా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులు, డిక్కీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ చైతన్య, గైనకాలజిస్టు డాక్టర్ ప్రవీణను మంగళవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా దవాఖానలో బాధితులకు సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ఆపత్కాల పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకోలేక, ఉపాధికి దూరమై యువకులు, పర్యాటకం రంగం, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలతోనే యువతకు ఉపాధి లభిస్తుందని వారిని ఆదుకోవాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు. లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకుల ఎగుమతి, దిగుమతులపై జీఎస్టీ భారాన్ని తగ్గించాలని, కరోనా దెబ్బకు దేశంలో ఇబ్బం దులు పడుతున్న పరిశ్రమలకు వెసలుబాటు కల్పించాలని కోరారు. అదేవిధంగా డిక్కీ జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్య సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులు చైత న్య, ప్రవీణకు తమ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. మారుమూల ప్రాంతం అచ్చంపేటలో పేద ప్రజల సేవకోసం ‘సురక్ష ప్రజా వైద్యశాల’ను ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలు గర్వించతగ్గ విషయమన్నారు. ఆపత్కాల సమయంలో ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం దవాఖాన వైద్యులు చైతన్య, ప్రవీణ డిక్కీ వ్య వస్థాపకులు మిలింద్ కాంబ్లే, జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బుద్దిస్టు భక్తులు, అంబేద్కరిస్టులు సిద్దార్థ మహాదేవ్, వెంకటేశ్, నాసర య్య, శ్రీనువాసులు, రమేశ్, పర్వతాలు, దశరథం తదితరులు ఉన్నారు.