కొల్లాపూర్, మే 25 : చెరువులు, కుంటలను పరిశీలించి వర్షాకాలంలోగా పటిష్టం చేయాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మంగళవారం కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పరిధిలోని కాల్వల్లో జమ్ముగడ్డి ఏపుగా పెరగడంతో ఆయకట్టు పొ లాలకు సాగునీరు పారక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాల్వలోల జమ్ముగడ్డిని తీసేసి నిర్ధేశించిన ఆయకట్టుకు నీరు సాఫీగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని మొలచింతపల్లి జీల్దార్తిప్ప చెరువు, పెంట్లవెల్లి కత్వాకాల్వ, పాన్గల్ రామన్నగట్టు రిజర్వాయర్, సింగవట్నం శ్రీవారిసముద్రం నుంచి గోపల్దిన్నె రిజర్వాయర్ను కృష్ణానది నీటితో నింపే లింక్ కెనాల్ తదితర సమస్యలపై ఎమ్మెల్యే బీరం అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సమావేశంలో చీఫ్ ఇంజినీరు అమిత్ఖాన్, సూపరింటెండెంట్ ఇంజినీరు విజయభాస్కర్రెడ్డి, డీఈలు, ఏఈ లు, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి, ము క్కిడిగుండం సర్పంచ్ ధశరథ్నాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచదంర్యాదవ్, నాయకులు సాయిరాంయాదవ్, ముచ్చెల రామకృష్ణ తదితరులు ఉన్నారు.