కొల్లాపూర్, జూన్ 24: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పొయిన పిల్లలకు తక్షణ సాయం కింద తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తున్నదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. కొల్లాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిదండ్రులను కోల్పొయిన 10మంది పిల్లలను గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం బాధితులకు ఒక్కొక్కరికీ రూ.2వేలు చెక్కులను ఎమ్మెల్యే బీరం అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటరమణ, ఐసీపీఎస్ నిరంజన్, సూపర్వైజర్ జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వనపర్తి విద్యుత్ ఎస్ఈ
టీఎస్ ఎస్పీడీసీఎల్ వనపర్తి జిల్లా నూతన ఎస్ఈగా నియమితులైన నాగేంద్రకుమార్ గురువారం కొల్లాపూర్లో క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పాన్గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల ప్రజలు, రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకోవాలని ఎస్ఈ నాగేంద్రకుమార్కు సూచించారు. ఎమ్మెల్యే బీరంను కలిసిన వారిలో డీఈఈ నరేందర్కుమార్, ఏఈలు నర్సింహ, నాగశేషయ్య, కాంట్రాక్టర్ రఘుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
అనారోగ్యాలు, ప్రమాదాల బారినపడిన క్షతగాత్రులు మెరుగైన వైద్యం కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొందుటకు కావాల్సిన డబ్బులు సీఎం సహాయనిధి నుంచి నిరుపేదలకు మంజూరవుతున్నాయని, ఈ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. పెద్దకొత్తపల్లి మండలం దేవునితిర్మలాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు బొక్కలయ్యకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.25వేలు చెక్కును గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం అందజేశారు. అలాగే కొల్లాపూర్ మండలం ఎల్లూరుకు చెందిన కురుమూర్తికి రూ.60వేలు చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కిషన్నాయక్, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.