మహబూబ్నగర్ మెట్టుగడ్డ,
మే 23: తమ కూతురు పెండ్లికి హాజరుకాలేని పరిస్థితులలో ఉన్న పెండ్లి కూతురు తల్లిదండ్రులను తన వాహనంలో తరలించారు మహబూబ్నగర్ వన్టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం అల్లామాయపల్లికి చెందిన యువతి, మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న బోయపల్లి గ్రామానికి చెందిన యువకుడితో ఆదివారం ఉద యం వివాహం జరగాల్సి ఉన్నది. ఈ క్రమంలో పెండ్ల్లి కూతురు తరఫు బంధువులు ఓ వాహనంలో బయల్దేరారు. మహబూబ్నగర్ పట్టణంలో పోలీసులు తని ఖీ చేస్తుండగా ఆ వాహనంలో 30 మంది వరకు ఉండడంతో అందరినీ దించి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పెండ్లికూతురు తల్లిదండ్రులు, సామగ్రి వీరి వద్దే ఉన్నాయని గుర్తించిన సీఐ వేడుకకు ఆటంకం కావొద్దని తన వాహనంలో వారిని తరలించారు. దీంతో సీఐకి అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. సీఐ నెటిజన్ల నుంచి అభినందనలు అందుకుంటున్నారు.