అచ్చంపేట/అచ్చంపేట రూరల్, జూన్ 21: ఆచార్య జయశంకర్సార్ ఆశయ సాధనకు కృషి చేయాలని మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద జయశంకర్ సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాగృతి ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద, రాం రహీం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ నర్సింహగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జయశంకర్ సార్ భౌతికంగా మన మధ్య లేకపోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరిరాజు, కౌన్సిలర్స్ రమేశ్రావు, గౌరీశంకర్, రమేశ్, శ్రీను, సునీత, మనోహర్ప్రసాద్, జాగృతి నాయకులు చారగొండ సత్యం, కృష్ణ, కరుణాకర్, రాజశేఖర్, శివరాములు, ఆటో యూనియన్ నాయకులు మహబూబ్ఆలి, సుల్తాన్, బురాన్, శ్రీను, శివ, ఉస్మాన్, అశోక్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ సార్ కలలు నిజం చేద్దాం
తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలు నిజం చేద్దామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాశ్రావు, మున్సిపల్ స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ మనోహర్రెడ్డి, షానవాజ్ఖాన్, బావండ్ల మధు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో..
తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం కల్వకుర్తి మున్సిపాలిటీ సుభాశ్నగర్ కాలనీలో జయశంకర్ సార్ వర్ధంతని నిర్వహించారు. ఈ సందర్భం గా జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్నాయక్, తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ షకీల్, జిల్లా అధ్యక్షుడు గణేశ్, జిల్లా యూత్ ఐకాన్ అరుణతేజ, తిరుమలేశ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.
భారతరత్న ప్రకటించాలి
తెలంగాణ ఉద్యమ సాధనలో ప్రొఫెసర్ జయశంకర్కు కేంద్రం నుంచి భారతరత్న ప్రకటించాలని కల్వకుర్తి బీసీ సబ్ప్లాన్ సాధన తాలూకా కమిటీ అధ్యక్షుడు రాజేందర్ కోరారు. కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ తల్లి, అమరవీరుల ప్రాంగణం వద్ద కల్వకుర్తి తాలూకా బీసీ సబ్ప్లాన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సబ్ప్లాన్ ప్రధాన కార్యదర్శి గోపాల్, నాయకులు దుర్గాప్రసాద్, నాగుల వెంకటేశ్వర్లు, కృష్ణగౌడ్, మల్లన్న, రమేశ్చారి, నర్సింహ, సురేందర్గౌడ్, భీమేశ్వర్, మల్లేశ్చారి తదితరులు ఉన్నారు.
లింగాల మండలంలో..
ప్రొఫెసర్ జయశంకర్సార్ ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎస్సై కృష్ణయ్య రానోజీ అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ మండల నాయకుల అధ్యర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు, జనార్దన్, ప్రణయ్, శ్రీనివాసులు, ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
వంగూరు మండలంలో..
మండలకేంద్రంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, పోతారెడ్డిపల్లిలో జిల్లా జాగృతి మహిళా కన్వీనర్ మంజుల ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరేందర్రావు, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు హమీద్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు లాలూయాదవ్, కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్, నాయకులు రాజారంగారావు, ఎల్లాగౌడ్, హరినాథ్, బాలస్వామిగౌడ్, జంగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
కొల్లాపూర్లో..
తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతిని పట్టణంలోని పీజీ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ప్రభాకర్రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పట్టణంలో మాజీమంత్రి జూపల్లి క్యాంపు కార్యాలయంలో జూపల్లి అనుచరవర్గం జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి కౌన్సిలర్లు రహీం, నహీం నివాళులర్పించారు.
జిల్లా కేంద్రంలో..
నాగర్కర్నూల్, జూన్ 21 : ఎస్టీయూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని సోమవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, సత్యనారాయణ, జిల్లా నాయకులు, మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, వెంకటస్వామి, శ్రీనివాసాచారి, రామేశ్వర్రావు, రమేశ్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు సీహెచ్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాజిపేట మండలంలో..
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా సభ్యుడు ప్రదీప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు స్వామి, ఎంపీటీసీ లీలావతి, కో ఆప్షన్ సభ్యుడు రజాక్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.