పంట పెట్టుబడి సాయంతో పండుగలా వ్యవసాయం
11,980మంది రైతుల ఖాతాల్లో రూ.16కోట్ల 18లక్షలు జమ
మరికల్, జూన్ 20 : గతంలో వ్యవసాయం దండగా అన్నారు.. నేడు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పథకాలతో వ్యవసాయం పం డుగలా మారింది. సమైక్య రాష్ట్రంలో రైతన్నకు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోడ్డెక్కనిదే ఏదీ దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం రైతన్నల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో అన్నదాత ఆనందంగా ఉన్నా డు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత రైతన్నల సంక్షేమమే ధ్యే యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నది. నాడు కన్నీరు పెట్టిన రైతన్న నేడు ఆనందంగా వ్యవసాయం చేస్తున్నాడు. రైతులకోసం సమ గ్ర భూ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబం ధు, 24గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్, సబ్సిడీ విత్తనా లు, ఎరువులు తదితర పథకాలను అమలు చేస్తున్నారు. అలాగే రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో వ్యవసాయ గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నది. దీంతో రైతులు పండించిన పంటలకు అధిక ధర వచ్చే వరకు భద్రపర్చుకోవచ్చు. ఈ వానకాలంలో మండలంలోని 11,980 మంది రైతులకుగానూ రైతుబంధు పథకం తో రూ.16కోట్ల 18లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఇది రైతు ప్రభుత్వం
రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం పెద్దపీట వేయడం సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతుబంధు పథకంతో రైతులకు పంట పె ట్టుబడి సాయం, ఉచిత బీమా సౌ కర్యం కల్పించడం రైతులకు భ రోసానిస్తున్నది. రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
కృష్ణారెడ్డి, అప్పంపల్లి