22 గ్రామాల్లో తడిసిన 31,270 ధాన్యం బస్తాలు
రైతులు అధైర్యపడొద్దు.. ధాన్యం కొంటాం
డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి
కొత్తకోట, మే 20 : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి మండలంలోని 22 గ్రామాల్లో 31,270 బస్తాల ధాన్యం తడిసినట్లు తాసిల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఏపీఎస్ కొత్తకోట పరిధిలోని పది గ్రామాల్లోని ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 15,650 బస్తాలు తడవగా, రామకృష్ణాపురం సింగిల్విండో పరిధిలోని ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని పది గ్రామాల్లో 13,120 బస్తాలు తడిశాయి. మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన అప్పరాల గ్రామంలో 2 వేలు, పామాపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో 500 బస్తాల ధాన్యం తడిసినట్లు ఏపీఎం శ్రీనివాసులు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అదైర్యపడొద్దని డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్ చెప్పారు.