నారాయణపేట, మే 17 : ఆర్థిక నేరాలు జరిగినప్పుడు కేసును ఛేదించడంతో బాధితులకు వా రి సొమ్మును త్వరితగతిన అందించి నేరస్తులకు శిక్షలు పడేలా చేయడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కృషి చేయాలని క్రైమ్ స్టాఫ్ వర్టికల్ ఇన్చార్జి రామ్లాల్ అన్నారు. సోమవారం జిల్లాలోని పోలీస్స్టేషన్ల సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేర నియంత్రణ, నేరస్తులపై నిఘా, ఇన్వెస్టిగేషన్, కమ్యూనిటీ పోలీసిం గ్ అనే అంశాలపై ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ని పౌరులకు తమ ఆస్తిపాస్తులు సురక్షితం అనే భరోసాను కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్ పరిధి లో జరిగే నేరాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, హిస్టరీ షీటర్స్, అనుమానితులపై ని రంతరం నిఘా ఉంచాలన్నారు. ఒక నేరస్తుడిని ఇంటరాగేషన్ చేయడం ద్వారా అతడి పూర్తి వివరాలు తెలుసుకునే నైపుణ్యం కలిగి ఉండాలన్నా రు. నేరాలను నిరోధించేందుకు స్థానిక కమ్యూని టీ వ్యక్తులను భాగస్వాములను చేయాలని, సీసీ టీవీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అ వగాహన కల్పించాలన్నారు. నేర రహిత సమాజ స్థాపనలో పోలీసులకు ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించేలా కృషి చేయాలన్నారు. నూతన సాంకేతిక అంశాలపై ఎప్పటికప్పుడు అ వగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణలో జిల్లాలోని క్రైమ్ వర్టికల్ పోలీస్ అధికారు లు, సిబ్బంది పాల్గొన్నారు.